జిల్లా ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు
మర్యాద పూర్వకంగా కలిసిన పోలీస్ అధికారులు
జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు
కొత్తగూడెం(టైమ్టుడే):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఎస్పీగా బి.రోహిత్ రాజు ఐపిఎస్ బాధ్యతలు చేపట్టారు.శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న రోహిత్ రాజు ఎస్పీ డా.వినీత్.జి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు నూతన ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.2018 బ్యాచ్ నకు చెందిన ఐపీఎస్ అధికారి రోహిత్ రాజు ప్రస్తుతం హైద్రాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా బదిలీ అయ్యారు.గతంలో భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తూ పదోన్నతిపై గ్రేహౌండ్స్ ఏస్పీగా బదిలీ అయ్యారు.2023 నవంబర్ నెలలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు.ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
