భాద్యతగా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో గుర్తింపు లభిస్తుంది

సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ

భాద్యతగా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో గుర్తింపు లభిస్తుంది
సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ
భాద్యతగా విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో గుర్తింపు లభిస్తుంది

కొత్తగూడెం(టైమ్‌టుడే):

హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నాడు జిల్లా ఏఆర్ సిబ్బందికి మొబైలైజేషన్ పరేడ్ కార్యక్రమం ప్రారంభమయ్యింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ముందుగా జిల్లా సాయుధ బలగాల చేత గౌరవ వందనం స్వీకరించారు.05 ప్లాటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పెరేడ్ నకు ప్లాటూన్ కమాండర్గా ఆర్ఐ రవి వ్యవహారించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానసికంగా,శారీరకంగా దృఢత్వం కలిగి ఉన్నప్పుడే బాధ్యతాయతమైన విధులను క్రమశిక్షణతో నిర్వర్తించగలుగుతామని అన్నారు.15 రోజుల పాటు జరిగే ఈ మొబలైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోలీసు శాఖలో కాలానుగుణంగా అనుసరిస్తున్న శిక్షణను పొందాలని సూచించారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమని అందుకు అనుగుణంగా అందరూ భాద్యతగా పనిచేయాలని కోరారు.రిఫ్రెష్ కోర్స్ లాంటి మొబలైజేషన్ ఆర్మడ్ రిజర్వ్ సిబ్బందికి చాలా కీలకమని అన్నారు. శిక్షణా కాలంలో నేర్చుకున్న అంశాలను మర్చిపోకుండా ఉండటంతో పాటు శారీరకంగా దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని తెలిపారు.పదిహేను రోజుల పాటు ఉత్సాహంగా పాల్గొని గతంలో శిక్షణ పొందిన మెళుకువలను నివృత్తి చేసుకుంటూ ఇండోర్,ఔట్డోర్,ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఉత్తమ ప్రతిభ చూపాలన్నారు.నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత,కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ శిక్షణాకాలంలో ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని అందులో భాగంగానే సెర్మోనియల్ పరేడ్ లో అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,అడ్మిన్ ఆర్ఐ రవి,ఎంటిఓ సుధాకర్,హోంగార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.